మసీదుల్లోకి గ్రీన్ షీల్డ్ కలిగినవారికి మాత్రమే ప్రవేశం
- December 24, 2021
బహ్రెయిన్: బహ్రెయిన్ మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్, ఇస్లామిక్ ఎఫైర్స్ మరియు ఎండోమెంట్స్, మసీదుల్లోకి గ్రీన్ షీల్డ్ కలిగినవారికి మాత్రమే ప్రవేశం కల్పిస్తూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రార్థనా సమయానికి 10 నిమిషాల ముందుగా మసీదులు తెరవబడుతాయి. ప్రార్థనలు ముగిసిన తర్వాత 10 నిమిషాలకు మసీదుల్ని మూసివేస్తారు. కోవిడ్ 19 సంబంధిత లక్షణాలు ఏవైనా వుంటే, మసీదులకు వెళ్ళవద్దని మినిస్ట్రీ సూచించింది. ప్రార్థనలు చేసేవారు పక్కనున్నవారితో కనీసం 2 మీటర్ల దూరాన్ని పాటించాలి. సొంతంగా రగ్గులు తెచ్చుకోవాలి. మసీదుల ప్రవేశ ద్వారాల వద్ద శానిటైజర్లు అందిస్తారు. ఫేస్ మాస్క్ లేకపోతే మసీదుల్లోకి ప్రవేశం వుండదు.
తాజా వార్తలు
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!







