చెన్నై విమానాశ్రయంలో భారీగా డైమండ్స్ పట్టివేత..
- December 29, 2021
చెన్నై: చైన్నై విమానాశ్రయంలో భారీగా డైమండ్స్ను పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు.ఓ దుబాయ్ ప్రయాణీకుడి వద్ద నుంచి 5.76 కోట్ల విలువ చేసే వజ్రాలను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.ఆ ప్రయాణికుడిని అరెస్టు అధికారులు అరెస్టు చేశారు.కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా వజ్రాలను ట్రాలీ బ్యాగ్ కింది భాగంలో దాచి, వజ్రాలను దాచిన ట్రాలీ బ్యాగ్తో దుబాయ్కు వెళ్లేందుకు యత్నించిన ప్రయాణికుడు.విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల స్కానింగ్లో బండారం బట్టబయలైంది.
దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కస్టమ్స్ అధికారులు. కాగా ఇటీవల ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ సహా ఇతర విలువైన వస్తువులు పట్టుబడుతుండటం అటు అధికారులను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ అక్రమ రవాణా ఏదో విధంగా చేయడానికి దుండగులు ప్రయత్నిస్తునే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్టుల్లో మరిన్ని కట్టుదిట్టమైన భద్రత చర్యలు పాటించాల్సిన అవసరం ఉంది.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







