ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు కరోనా…
- January 04, 2022
న్యూ ఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి వణికిస్తున్నది.రోజువారీ కేసులు భారీగా నమోదవుతున్నాయి.సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా సోకినట్టు కేజ్రీవాల్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.తనకు లక్షణాలు తక్కువగా ఉన్నాయని, వైద్యుల సలహా మేరకు హోమ్ ఐసోలేషన్లో ఉన్నానని అన్నారు. త్వరలోనే కోలుకొని తిరిగి బయటకు వస్తానని,ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కేజ్రీవాల్ పేర్కొన్నారు.దేశరాజధాని ఢిల్లీలో రోజువారి కేసులు భారీగా నమోదవుతున్నాయి.
అక్కడ పాజిటివిటీ రేటు 6కి పైగా నమోదయింది.ఇప్పటికే ఎల్లో అలర్ట్ నడుస్తున్నది.ఈరోజు నమోదయ్యే కేసులను అనుసరించి రెడ్ అలర్ట్ ప్రకటించే అవకాశం ఉంటుంది. వీకెంట్ లాక్ డౌన్ విధించే అవకాశం ఉన్నట్టుగా నిపుణులు చెబుతున్నారు.కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 84 శాతం ఒమిక్రాన్ కేసులు ఉన్నట్టుగా ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.కేసులు పెరుగుతున్న వేళ తగిన జాగ్రత్తు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి పాన్ దరఖాస్తులో మార్పులు
- ముంబై ఇండియన్స్ కొత్త రన్ చేజ్ రికార్డు
- డిజిటల్ చెల్లింపులకు 2FA తప్పనిసరి
- ఎగ్జిట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించిన ఇండిగో ప్రయాణికుడు
- ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ చర్చలు..!!
- సౌదీలో రోడ్డు ప్రమాదంలో బహ్రెయిన్ వాసి మృతి..!!
- వర్షం వల్ల కలిగే నష్టానికి బీమా వర్తించదా? Dh25,000 బిల్లులు కట్టాల్సిందేనా?
- సంక్షోభ నిర్వహణలో ఖతార్ విజయం సాధించింది: న్యాయశాఖ మంత్రి
- ఒమన్లో 404 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- 2025లో కేసుల సంఖ్యలో 7.6% పెరుగుదల: కువైట్









