ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు కరోనా…
- January 04, 2022
న్యూ ఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి వణికిస్తున్నది.రోజువారీ కేసులు భారీగా నమోదవుతున్నాయి.సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా సోకినట్టు కేజ్రీవాల్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.తనకు లక్షణాలు తక్కువగా ఉన్నాయని, వైద్యుల సలహా మేరకు హోమ్ ఐసోలేషన్లో ఉన్నానని అన్నారు. త్వరలోనే కోలుకొని తిరిగి బయటకు వస్తానని,ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కేజ్రీవాల్ పేర్కొన్నారు.దేశరాజధాని ఢిల్లీలో రోజువారి కేసులు భారీగా నమోదవుతున్నాయి.
అక్కడ పాజిటివిటీ రేటు 6కి పైగా నమోదయింది.ఇప్పటికే ఎల్లో అలర్ట్ నడుస్తున్నది.ఈరోజు నమోదయ్యే కేసులను అనుసరించి రెడ్ అలర్ట్ ప్రకటించే అవకాశం ఉంటుంది. వీకెంట్ లాక్ డౌన్ విధించే అవకాశం ఉన్నట్టుగా నిపుణులు చెబుతున్నారు.కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 84 శాతం ఒమిక్రాన్ కేసులు ఉన్నట్టుగా ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.కేసులు పెరుగుతున్న వేళ తగిన జాగ్రత్తు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..







