సిబ్బంది ఆరోగ్యం, భద్రత మా ప్రధాన ప్రాధాన్యత: సీపీ మహేశ్ భగవత్
- January 04, 2022
హైదరాబాద్: మంగళవారం అంబర్పేటలోని సీఏఆర్ హెడ్ క్వార్టర్స్లో సాగర్ ఫార్మా ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ సిబ్బందికి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మెడికోవర్, గ్లోబల్ ఆసుపత్రులు, ఇఎస్ఐకి చెందిన వైద్యుల బృందం సిబ్బంది హాజరై వైద్య పరీక్షలు నిర్వహించారు.
_1641299967.jpg)
అనంతరం మీడియాతో సీపీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ మంచి ఆరోగ్యం ఎంతో అవసరమని, పోలీసులు పౌరులకు అత్యుత్తమ సేవలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. రాచకొండ కమిషనరేట్లో సిబ్బందికి ఉచిత వైద్యసౌకర్యాలు అందించేందుకు అన్ని కార్యక్రమాలు చేపడుతున్నామని, అందులో భాగంగా నిర్వహిస్తున్న ఉచిత వైద్యశిబిరం కూడా ఒకటని సీపీ తెలిపారు. ఈ శిబిరంలో *కంటి పరీక్షలు, లైవ్ ఫంక్షన్ టెస్ట్, కార్డియాలజీ, గైనకాలజీ తదితర* అనేక వైద్య పరీక్షలు నిర్వహిస్తామని సీపీ తెలిపారు. సిబ్బంది ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసేందుకు ఉచిత వైద్య శిబిరాలు దోహదపడతాయని సీపీ అభిప్రాయపడ్డారు. ప్రయోగశాలలు.ఓమిక్రాన్ వేరియంట్తో మూడవ వేవ్కు అవకాశం ఉన్నందున అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ సిబ్బందిని ఆదేశించారు. (శానిటైజర్, మాస్క్, సామాజిక దూరం) యొక్క ప్రాముఖ్యతను పునరుద్ఘాటించారు.రాచకొండ కమిషనరేట్లో కోవిడ్-19 బారిన పడిన సిబ్బంది పట్ల అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సీపీ తెలిపారు. పాజిటివ్గా తేలిన పోలీసు సిబ్బందికి 14 రోజులు విశ్రాంతి ఇవ్వడంతో పాటుగా 5000 రూపాయలు అందజేస్తామని, పోలీసు సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తోందని సీపీ పేర్కొన్నారు.పాసిటివ్ గా తేలిన 2030 మంది పోలీసులు కోలుకుని విధుల్లో చేరారని గుర్తు చేశారు.రాచకొండ కమిషనరేట్లో క్వారంటైన్ విధానం మరియు భద్రత, సంక్షేమ చర్యలను డిజిపి ఎం. మహేందర్రెడ్డి ఐపిఎస్ అభినందించారని గుర్తు చేశారు. రాచకొండలో పాజిటివ్గా తేలిన పోలీసు సిబ్బంది అందరి ఆరోగ్య పరిస్థితిని జూమ్ కాల్స్తో పాటు రాచకొండ కమిషనరేట్లోని యూనిట్ వైద్యులు పర్యవేక్షిస్తున్నారని, 24 గంటలూ పనిచేసే ప్రత్యేక కోవిడ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు సీపీ గుర్తు చేశారు. "కోవిడ్ బాధిత పోలీసు సిబ్బందికి ఉచిత వైద్య ఆక్సిజన్, ఉచిత అంబులెన్స్లు, ప్లాస్మా డొనేషన్, ఉచిత వ్యాక్సినేషన్ మొదలైన అనేక సేవలు అందించబడుతున్నాయి" అని సీపీ తెలిపారు.
రాచకొండ పోలీసులకు సహకరించిన డాక్టర్ సరిత, డాక్టర్ అచ్యుతరావు, సాగర్ ఫార్మాకు చెందిన సతీష్, మెడికోవర్, గ్లోబల్, ఈఎస్ఐ ఆస్పత్రుల వైద్యుల బృందాన్ని సీపీ అభినందించారు.
ఈ కార్యక్రమానికి అదనపు డిసిపి Sk షమీర్,అదనపు డిసిపి ఎ.లక్ష్మీనారాయణ,ఎన్.భాస్కర్, ఏసీపీ కె.నాగేంద్రుడు, ఏసీపీ జి.శ్రీను, ఏసీపీ పీ.భాస్కర్, అడ్మిన్ ఆర్ఐ ఎం.దిలీప్కుమార్, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు భద్ర రెడ్డి, సభ్యుడు క్రిస్న రెడ్డి తదితర అధికారులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







