బ్రేకింగ్: ‘రాధేశ్యామ్’ విడుదల వాయిదా

- January 05, 2022 , by Maagulf
బ్రేకింగ్: ‘రాధేశ్యామ్’ విడుదల వాయిదా

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ - రాధాకృష్ణ కాంబినేషన్‌లో రూపొందిన 'రాధే శ్యామ్' చిత్రాన్ని పోస్ట్‌పోన్ చేస్తున్నట్టు తాజాగా చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ కరోనా వ్యాప్తితో థర్డ్ వేవ్ 'ఒమైక్రాన్' వైరస్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దేశ విదేశాలలో ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య ఊహకందటం లేదు. ఈ నేపథ్యంలో అంతటా మళ్ళీ లాక్ డౌన్ ప్రక్రియను అమలు చేస్తున్నారు. ఇప్పటికే కరోనా థర్డ్ వేవ్ వల్ల అమెరికా వంటి దేశాలలో రోజుకు లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మన భారత దేశంలోనూ ఇదే క్రమంలో వ్యాపిస్తోంది. దాంతో టాలీవుడ్ చిత్రాల రిలీజ్‌ను పోస్ట్‌పోన్ చేస్తున్నారు. ఇటీవలే పాన్ ఇండియన్ సినిమా 'ఆర్ఆర్ఆర్' పోస్ట్‌పోన్ చేయగా ..ఇప్పుడు ప్రభాస్ 'రాధే శ్యామ్' చిత్రాన్ని పోస్ట్‌పోన్ చేస్తున్నట్టు మేకర్స్ అధికారిక ప్రకటనను ఇచ్చారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com