మహేష్ బాబుకు కరోనా
- January 06, 2022
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశారు.” నా ప్రియమైన అభిమానులకు.. శ్రేయోభిలాషులకు.. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా నేను కరోనా బారిన పడ్డాను. స్వల్ప లక్షణాలతో కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నేను ఇంట్లోనే ఐసోలేషన్ లో వైద్యుల సూచనలతో చికిత్స తీసుకుంటున్నాను. దయచేసి ఇటీవల నన్ను కలిసినవారందరు పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పటివరకు ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోలేదో వారు వెంటనే వ్యాక్సిన్ తీసుకోండి. అది కరోనా తీవ్రత నుంచి హాస్పిటల్ వరకు వెళ్లకుండా కొద్దిగా అయినా తప్పిస్తుంది. దయచేసి అందరు కరోనా నియమాలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండండి.. మళ్లీ తిరిగి రావడానికి వేచి ఉండలేను” అంటూ ట్వీట్ చేశారు. ఇక మహేష్ కి కరోనా రావడంతో ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ట్విట్టర్ వేదికగా కోరుతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!







