ఓమిక్రాన్ పై క్యాబినేట్ సబ్ కమిటీ సమీక్ష

- January 08, 2022 , by Maagulf
ఓమిక్రాన్ పై క్యాబినేట్ సబ్ కమిటీ సమీక్ష

కువైట్: ఓమిక్రాన్ ఎమర్జెన్సీపై క్యాబినేట్ సబ్ కమిటీ కమిటీ గురువారం అత్యవసర సమీక్ష నిర్వహించింది. ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి షేక్ హమద్ జాబర్ అల్-అలీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశం.. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండానే ముగిసింది. ఈ సమావేశంలో హెల్త్ మినిస్ట్రీ సమర్పించిన తాజా నివేదికలను సమీక్షించారు. కరోనా కొత్త వేరియాంట్ 'ఓమిక్రాన్' ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందడంపై పలు ప్రభుత్వ సంస్థలు నివేదికలు సమర్పించాయి. కువైట్‌లో ప్రస్తుతం ఎపిడెమియోలాజికల్ పరిస్థితి బాగానే ఉందని, ప్రపంచవ్యాప్తంగా ఇటీవలి కాలంలో కోవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో కువైట్ లోనూ పెరిగే అవకాశం ఉందని సీనియర్ ప్రభుత్వ వర్గాలు అభిప్రాయ పడ్డారని సమాచారం.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com