భారత్ కరోనా అప్డేట్
- January 09, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా కల్లోలం మళ్లీ మొదలైంది.కరోనా థర్డ్ వేవ్ ప్రభావం భారత్పై ఏ స్థాయిలో ఉందో.. వరుసగా వెలుగు చూస్తున్న కొత్త కేసులే చెబుతున్నాయి.గత ఐదు రోజులుగా ప్రతీ రోజు భారీ సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తూ.. కరోనా మీటర్ పరుగులు పెడుతోంది… కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,59,632 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి, మరో 327 మంది కోవిడ్ బాధితులు కన్నుమూశారు.. ఇదే సమయంలో 40,863 కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది కేంద్రం.
భారత్లో కోవిడ్ కేసులు పాజివిటీ రేటు 10.21 శాతానికి పెరగడం ఆందోళన కలిగిస్తోంది.. ఇప్పటి వరకు మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 4,83,790కు పెరగగా.. కోలుకున్నవారి సంఖ్య 3,44,53,603గా ఉంది.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,90,611 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్లో పేర్కొంది కేంద్ర ఆరోగ్యశాఖ.మరోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా స్పీడ్గా పెరిగిపోతున్నాయి.ఇప్పటికే 27 రాష్ట్రాలను ఒమిక్రాన్ చుట్టేసింది.ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,623కు చేరింది.ఇప్పటి వరకు 1,490 ఒమిక్రాన్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!









