తమిళనాడులో సంపూర్ణ లాక్డౌన్..
- January 09, 2022
న్యూ ఢిల్లీ: మరోసారి కరోనా మహమ్మారి పంజా విసురుతోంది.. దీంతో కట్టడి చర్యలకు పూనుకుంటున్నాయి ఆయా రాష్ట్రాలు, నైట్ కర్ఫ్యూలు, సంపూర్ణ లాక్డౌన్లు..ప్రజలు ఎక్కువగా కలుసుకునే అవకాశం ఉన్న విందు, వినోదాలపై ఆంక్షలు..ఇలా పలు రకాల చర్యలు తీసుకుంటున్నారు.తమిళనాడు ప్రభుత్వం సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించింది.ఆదివారం అంటే ఇవాళ ఒక్కరోజు సంపూర్ణ లాక్డౌన్ అమలు చేస్తున్నారు.అత్యవసర సేవలు మినహా వేటికీ అనుమతి లేదని ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే, ఇవాళ ఒకేరోజుకు లాక్డౌన్ పరిమితం ప్రతి ఆదివారం సంపూర్ణ లాక్డౌన్ ను అమలు చేయనున్నారు.ప్రజలు ప్రశాంతంగా ఇళ్లలోనే ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు..శనివారం రాత్రికే అన్ని చెక్ పోస్టుల్లోనూ రోడ్లను, వంతెనల్నీ సైతం మూసి వేశారు.
మరోవైపు ఇవాళ సంపూర్ణ లాక్డౌన్ నేపథ్యంలో.. శనివారం అన్ని మార్కెట్లలో రద్దీ కనిపించింది.మద్యం దుకాణాలు, కాయగూరల మార్కెట్లకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ప్రజలు..చేపలు, మాంసం మార్కెట్లు జనంతో కిక్కిరిశాయి.ఇక తమిళనాడులో సగటున రోజుకు 3 వేల వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.దీంతో.. నైట్ కర్ఫ్యూను ప్రకటించిన ప్రభుత్వం..గురువారం నుంచి నైట్ కర్ఫ్యూను అమలు చేస్తోంది.ఇక, చెన్నైలో కరోనా కట్టడి చర్యల కోసం 15 మంది ఐఏఎస్లతోప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు సీఎం స్టాలిన్.
తాజా వార్తలు
- బిఎస్సీ అగ్రికల్చర్ ప్రశ్న పత్రం లీక్
- అనుమతి లేకుండా ఫోటోలు వాడిన మసాజ్ సెంటర్ల పై కేసు పెట్టిన ఇన్ఫ్లూయెన్సర్
- ఇరాన్ దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలు, ఇంటర్నెట్ నిలిపివేత
- తెలంగాణ: షోరూమ్లోనే వాహన రిజిస్ట్రేషన్
- ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపిన సీఎం రేవంత్
- TTD ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్
- మలేషియా బ్యాడ్మింటన్ టోర్నమెంట్: సెమీస్కు పీవీ సింధు
- అబుదాబిలో 7 మోటార్బైక్ ప్రమాదాలు.. 9 మందికి గాయాలు..!!
- సల్మియా మార్కెట్లో అగ్నిప్రమాదం..తప్పిన పెనుప్రమాదం..!!
- బు సిల్లా ఇంటర్ఛేంజ్పై తాత్కాలిక ట్రాఫిక్ ఆంక్షలు..!!







