తమిళనాడులో సంపూర్ణ లాక్డౌన్..
- January 09, 2022న్యూ ఢిల్లీ: మరోసారి కరోనా మహమ్మారి పంజా విసురుతోంది.. దీంతో కట్టడి చర్యలకు పూనుకుంటున్నాయి ఆయా రాష్ట్రాలు, నైట్ కర్ఫ్యూలు, సంపూర్ణ లాక్డౌన్లు..ప్రజలు ఎక్కువగా కలుసుకునే అవకాశం ఉన్న విందు, వినోదాలపై ఆంక్షలు..ఇలా పలు రకాల చర్యలు తీసుకుంటున్నారు.తమిళనాడు ప్రభుత్వం సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించింది.ఆదివారం అంటే ఇవాళ ఒక్కరోజు సంపూర్ణ లాక్డౌన్ అమలు చేస్తున్నారు.అత్యవసర సేవలు మినహా వేటికీ అనుమతి లేదని ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే, ఇవాళ ఒకేరోజుకు లాక్డౌన్ పరిమితం ప్రతి ఆదివారం సంపూర్ణ లాక్డౌన్ ను అమలు చేయనున్నారు.ప్రజలు ప్రశాంతంగా ఇళ్లలోనే ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు..శనివారం రాత్రికే అన్ని చెక్ పోస్టుల్లోనూ రోడ్లను, వంతెనల్నీ సైతం మూసి వేశారు.
మరోవైపు ఇవాళ సంపూర్ణ లాక్డౌన్ నేపథ్యంలో.. శనివారం అన్ని మార్కెట్లలో రద్దీ కనిపించింది.మద్యం దుకాణాలు, కాయగూరల మార్కెట్లకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ప్రజలు..చేపలు, మాంసం మార్కెట్లు జనంతో కిక్కిరిశాయి.ఇక తమిళనాడులో సగటున రోజుకు 3 వేల వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.దీంతో.. నైట్ కర్ఫ్యూను ప్రకటించిన ప్రభుత్వం..గురువారం నుంచి నైట్ కర్ఫ్యూను అమలు చేస్తోంది.ఇక, చెన్నైలో కరోనా కట్టడి చర్యల కోసం 15 మంది ఐఏఎస్లతోప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు సీఎం స్టాలిన్.
తాజా వార్తలు
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు
- నేటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు..
- వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- పారిపోతున్న పనిమనిషి కేసులు పెరుగుతున్నాయా?
- రియాద్లో అర్హత లేని ఆరోగ్య నిపుణులు అరెస్ట్
- సభన్లో కార్మికుల కోసం రెసిడెన్షియల్ సిటీ నిర్మాణం
- ఖైదీల విడుదలకు అహద్ ఫౌండేషన్ సాయం
- అరబ్ సమ్మిట్.. సిరియా, ఇరాక్లను ఆహ్వానించిన కింగ్ హమద్
- ఎయిర్ ఇండియా పై రూ.80 లక్షల ఫైన్