పార్లమెంట్లో 400మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్
- January 09, 2022
న్యూ ఢిల్లీ: ఢిల్లీలోని పార్లమెంట్లో 400మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దేశ రాజధానిలో కొత్త కేసులు అకస్మాత్తుగా పెరిగిన నేపథ్యంలో జనవరి 6-7 తేదీల్లో పరీక్షలు నిర్వహించగా.. 65 మంది రాజ్యసభ సెక్రటేరియట్ సభ్యులు, 200మంది లోక్సభ సెక్రటేరియట్ సభ్యులు.. 133 మంది పార్లమెంట్లో పనిసేవారికి కరోనా సోకినట్లు గుర్తించారు.
జనవరి 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మొత్తం 1,409 మందికి చేపట్టిన కరోనా పరీక్షల్లో 402 మందికి కొవిడ్ పాజిటివ్గా తేలింది. ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధరణకు వారి నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్కు పంపించినట్లు అధికారులు చెప్పారు. భారీగా కరోనా కేసులు నమోదైన క్రమంలో రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు కరోనా మార్గదర్శకాలు విడుదల చేశారు.
ఉద్యోగుల ఉనికిపై ఆంక్షల వివరాలు:
అధికారులు, ఉద్యోగుల హాజరుపై రాజ్యసభ సెక్రటేరియట్ నిషేధం విధించింది. తాజా మార్గదర్శకాల ప్రకారం , అండర్ సెక్రటరీ / సీఈవో పదవి నుంచి 50 శాతం మంది అధికారులు, ఉద్యోగులు ఈ నెలాఖరు వరకు ఇంటి నుంచే పనిచేయాలి. వారు మొత్తం శ్రామిక శక్తిలో 65 శాతం ఉన్నారు.
వికలాంగులు, గర్భిణీ స్త్రీలకు కార్యాలయానికి హాజరు నుంచి మినహాయింపు లభిస్తోంది. అధికారిక సమావేశాలు వర్చువల్గా సాగనున్నాయి. మొత్తం 1300 మంది అధికారులు, ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఆదేశించారు . వారి సంక్రమణను నిశితంగా పరిశీలించాలని, అవసరమైతే, ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించడంలో సహాయపడాలని కోరారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







