పార్లమెంట్లో 400మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్
- January 09, 2022
న్యూ ఢిల్లీ: ఢిల్లీలోని పార్లమెంట్లో 400మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దేశ రాజధానిలో కొత్త కేసులు అకస్మాత్తుగా పెరిగిన నేపథ్యంలో జనవరి 6-7 తేదీల్లో పరీక్షలు నిర్వహించగా.. 65 మంది రాజ్యసభ సెక్రటేరియట్ సభ్యులు, 200మంది లోక్సభ సెక్రటేరియట్ సభ్యులు.. 133 మంది పార్లమెంట్లో పనిసేవారికి కరోనా సోకినట్లు గుర్తించారు.
జనవరి 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మొత్తం 1,409 మందికి చేపట్టిన కరోనా పరీక్షల్లో 402 మందికి కొవిడ్ పాజిటివ్గా తేలింది. ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధరణకు వారి నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్కు పంపించినట్లు అధికారులు చెప్పారు. భారీగా కరోనా కేసులు నమోదైన క్రమంలో రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు కరోనా మార్గదర్శకాలు విడుదల చేశారు.
ఉద్యోగుల ఉనికిపై ఆంక్షల వివరాలు:
అధికారులు, ఉద్యోగుల హాజరుపై రాజ్యసభ సెక్రటేరియట్ నిషేధం విధించింది. తాజా మార్గదర్శకాల ప్రకారం , అండర్ సెక్రటరీ / సీఈవో పదవి నుంచి 50 శాతం మంది అధికారులు, ఉద్యోగులు ఈ నెలాఖరు వరకు ఇంటి నుంచే పనిచేయాలి. వారు మొత్తం శ్రామిక శక్తిలో 65 శాతం ఉన్నారు.
వికలాంగులు, గర్భిణీ స్త్రీలకు కార్యాలయానికి హాజరు నుంచి మినహాయింపు లభిస్తోంది. అధికారిక సమావేశాలు వర్చువల్గా సాగనున్నాయి. మొత్తం 1300 మంది అధికారులు, ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఆదేశించారు . వారి సంక్రమణను నిశితంగా పరిశీలించాలని, అవసరమైతే, ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించడంలో సహాయపడాలని కోరారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







