సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ కు కరోనా పాజిటివ్..
- January 09, 2022
హైదరాబాద్: కరోనా కల్లోలం కొనసాగుతుంది. మరో సారి ఈ మహమ్మారి విజృంభిస్తుంది. రోజురోజుకు కేసులు పెరుగుతుండటం కలవరానికి గురిచేస్తుంది. ఆల్రెడీ బాలీవుడ్ను వణికిచ్చేస్తోన్న కరోనా… తాజాగా టాలీవుడ్ లోనూ ప్రకంపణలు రేపుతోంది. ఈ మహ్మమారి దాటికి ఇప్పటికే సినిమా షూటింగ్లన్నీ క్యాన్సిల్ అవుతుండగా… సెలబ్రిటీలు దీని బారిన పడి ఇంటికే పరిమితమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ క్రమంలోనే కరోనా సోకిన నటుడు సత్యరాజ్ తాజాగా క్రిటికల్ కండీషన్లో ఉన్నారట. ఇప్పుడిదే న్యూస్ ఆందోళన కలిగిస్తోంది. సత్య రాజ్ మాత్రమే కాదు మనదగ్గర, మంచు మనోజ్, మంచు లక్ష్మీ, విశ్వక్ సేన్, మహేష్ బాబు, తమన్, త్రిష, వరలక్ష్మి శరత్ కుమార్ ఇలా వరుసగా అందరు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా విలక్షణ నటుడు రాజేంద్రప్రసాద్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్ కోవిడ్ చికిత్స నిమిత్తం ఏఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తుంది. పలువురు ఆయన ఫ్యామిలీ మెంబర్స్కు ఫోన్ చేసి ధైర్యం చెబుతున్నారని తెలుస్తుంది. రాజేంద్ర ప్రసాద్ ఫ్యాన్స్ కూడా ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు. ఇక ఆయన ఆరోగ్యం పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారట.
తాజా వార్తలు
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు
- ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
- చైనాలో భారత రాయబారిగా విక్రమ్ దొరైస్వామి
- ఏపీలో 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల..
- భారత్ లోనే తొలి గ్యాస్ ఏటీఎం
- సౌదీ మీదుగా భారత్ కు విమాన సర్వీసులు ప్రారంభించిన జజీరా ఎయిర్వేస్..!!
- ఒమన్, మిడిలీస్టు స్టూడెంట్స్ కోసం క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్..సీబీఎస్ఈ
- ఒమన్తో గ్రీన్ కారిడార్ను ప్రకటించిన దుబాయ్..!!
- సౌదీ అరేబియాలో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- కర్బాబాద్ అగ్నిప్రమాదంలో ముగ్గురికి గాయాలు..!!









