ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు..
- January 09, 2022
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి.ఆదివారం (జనవరి 9) కొత్తగా 1,257 మంది వైరస్ బారిన పడినట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24గంటల్లో 38, 479శాంపిల్స్ పరీక్షించారు. కాగా వైరస్ బారిన పడి.. గుంటూరు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. తాజాగా.. మరో 140 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. కొత్త కేసులతో కలిపి ప్రస్తుతం రాష్ట్రంలో 4774 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కాగా గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరులో 254 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత విశాఖలో 196, అనంతపురంలో 138, కృష్ణాలో 117, గుంటూరులో 104, నెల్లూరులో 103 కేసులు నమోదయ్యాయి. కాగా రాష్ట్రంలో ఇప్పటి దాకా 3,16,05,951 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా మొత్తం 20,78, 964 మంది కరోనా బారిన పడినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. అదేవిధంగా 20, 59, 685 మంది వైరస్ను జయించారు. మొత్తం 14505 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్కోచ్లు వీళ్లే
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు
- ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ









