కోవిడ్ చికిత్సకు పగడ్బందీ చర్యలు
- January 10, 2022
కువైట్: దేశంలో కోవిడ్-19 క్లినికల్ కేసుల పెరుగుదలను తట్టుకునేలా హెల్త్ వ్యవస్థ పూర్తి సామర్థ్యంతో సిద్ధంగా ఉందని హెల్త్ మినిస్ట్రీ(MoH) తెలిపింది. ఎలాంటి పరిస్థతుల్నైనా ఎదుర్కునేందుకు కోవిడ్ వార్డులలో ఐసియు బెడ్లను అందుబాటులో పెట్టామన్నారు. పరిస్థితులను గమనిస్తున్నామని, అత్యవసర మెడికల్ టీమ్స్ రెడీగా ఉన్నాయని MoH తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లో కొవిడ్ మార్గదర్శకాలను పాటించాలని సూచించింది. మాస్కులు పెట్టుకోవాలని, పూర్తి టీకాలను పొందాలని, అర్హులైన వారు బూస్టర్ డోస్ తీసుకోవాలని సిటిజన్స్ అండ్ రెసిడెంట్స్ కు మంత్రిత్వ శాఖ కోరింది. ప్రతి ఒక్కరూ తమ ప్రయాణాలను పరిమితం చేసుకోవాలని, విదేశాల నుండి దేశానికి వచ్చే వారు నిర్దేశిత కాలానికి క్వారంటైన్ నిబంధనలకు కట్టుబడి ఉండాలని, ఇతరులతో కలవవద్దని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఇతర వ్యక్తులతో కలవవద్దని హెల్త్ మినిస్ట్రీ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







