డాక్టర్ జీవితాన్ని మార్చిన సంఘటన..
- January 10, 2022
బెంగుళూరు: వైద్యులు తమ వృత్తిని ఉద్యోగంగా భావిస్తే దానికి వంద శాతం న్యాయం చేయలేరు. తాము చదువుకున్న చదువుకి సార్ధకత ఉండాలని ప్రతి ఒక్క డాక్టర్ భావిస్తుంటారు. బెంగళూరుకు చెందిన డాక్టర్ సునీల్ కుమార్ ఓ రోజు హోసూర్-చెన్నై హైవే మీదుగా ప్రయాణిస్తున్నారు. అతడి కళ్ల ముందే జరిగిన యాక్సిడెంట్లో ఓ వ్యక్తి అత్యంత ప్రమాదంలో చిక్కుకున్నారు. వెంటనే డాక్టర్ సునీల్ మరో ఆలోచనలేకుండా అతడికి ప్రధమ చికిత్స అందించి సమీపంలోని ఆస్పత్రికి తీసుకు వెళ్లి సకాలంలో వైద్యం అందేలా చూశారు.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడికి చికిత్స చేసి ప్రాణం పోశారు. ఒక రోజు గడిస్తే కానీ చెప్పలేం అన్న వైద్యులు సకాలంలో చికిత్స అందడంతోనే అతడు కోలుకున్నాడని అతడి తల్లికి చెప్పారు. దాంతో బాధితుడి తల్లి డాక్టర్ సునీల్కి కాల్ చేసి కృతజ్ఞతలు తెలిపింది. డాక్టర్ని తమ ఇంటికి భోజనానికి ఆహ్వానించింది. ఆ ఒక్క సంఘటన డాక్టర్ సునీల్ జీవితాన్నే మార్చేసింది. తన భవిష్యత్ ప్రణాళికలన్నీ మార్చుకునేలా చేసింది. చివరికి 2011లో అతను BGS గ్లోబల్ హాస్పిటల్స్లో చేస్తున్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి మాతృ సిరి ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు.
తాజా వార్తలు
- వాట్సాప్లోనే ఈ-ఆధార్ డౌన్లోడ్.. కొత్త సర్వీస్!
- హర్మూజ్ జలసంధిని తెరవాలని ఇరాన్కు 20 దేశాల విజ్ఞప్తి
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్









