పోలీసు సిబ్బందికి ఎటువంటి ఆపదలు వచ్చినా నేను అండగా ఉంటా:ఏపీ డిజిపి
- January 10, 2022
అమరావతి: ఏపీలో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది వారి కుటుంబాలకు ఎటువంటి ఆపదలు కలిగినా తాను అండగా ఉండి వారి సంక్షేమానికి కృషి చేస్తానని రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ హామీ ఇచ్చారు.ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ దేశ్ పోలీస్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన పోలీస్ డైరీ-2022 ను ఆవిష్కరించిన డిజిపి ఈ సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ...క్షేత్రస్థాయి పోలీసు సిబ్బందికి ఉపయోగపడే ప్రభుత్వ ఉత్తర్వులు,సంక్షేమ కార్యక్రమాలు,ప్రభుత్వ మరియు శాఖాపరమైన సంక్షేమ పథకాలపై సమగ్ర సమాచారాన్ని ఈ డైరీ ద్వారా సిబ్బందికి అందజేయడం పై రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులను అభినందించారు.
రాష్ట్ర డిజిపి మాట్లాడుతూ...గత సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు సాధించిన విజయాలను స్పూర్తిగా తీసుకొని ఈ నూతన సంవత్సరంలో కూడా సిబ్బంది రెట్టింపు ఉత్సాహంతో విధులు నిర్వర్తించి, ప్రజలకు విలువైన, నాణ్యమైన సేవలు అందించడం ద్వారా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







