పోలీసు సిబ్బందికి ఎటువంటి ఆపదలు వచ్చినా నేను అండగా ఉంటా:ఏపీ డిజిపి
- January 10, 2022
అమరావతి: ఏపీలో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది వారి కుటుంబాలకు ఎటువంటి ఆపదలు కలిగినా తాను అండగా ఉండి వారి సంక్షేమానికి కృషి చేస్తానని రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ హామీ ఇచ్చారు.ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ దేశ్ పోలీస్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన పోలీస్ డైరీ-2022 ను ఆవిష్కరించిన డిజిపి ఈ సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ...క్షేత్రస్థాయి పోలీసు సిబ్బందికి ఉపయోగపడే ప్రభుత్వ ఉత్తర్వులు,సంక్షేమ కార్యక్రమాలు,ప్రభుత్వ మరియు శాఖాపరమైన సంక్షేమ పథకాలపై సమగ్ర సమాచారాన్ని ఈ డైరీ ద్వారా సిబ్బందికి అందజేయడం పై రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులను అభినందించారు.
రాష్ట్ర డిజిపి మాట్లాడుతూ...గత సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు సాధించిన విజయాలను స్పూర్తిగా తీసుకొని ఈ నూతన సంవత్సరంలో కూడా సిబ్బంది రెట్టింపు ఉత్సాహంతో విధులు నిర్వర్తించి, ప్రజలకు విలువైన, నాణ్యమైన సేవలు అందించడం ద్వారా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- వాట్సాప్లోనే ఈ-ఆధార్ డౌన్లోడ్.. కొత్త సర్వీస్!
- హర్మూజ్ జలసంధిని తెరవాలని ఇరాన్కు 20 దేశాల విజ్ఞప్తి
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్









