50% స్టాఫ్ తోనే పని చేయనున్న గవర్నమెంట్ ఆఫీసులు
- January 11, 2022
కువైట్: కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వ కార్యాలయాలు 50% సిబ్బందితోనే పనిచేయనున్నాయి. ప్రైవేట్ కార్యాలయాలలో కూడా సిబ్బందిని తగ్గించాలని అదేశించారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో వేలిముద్రల వ్యవస్థను నిలిపివేసి, స్టేట్ మెంట్ తో హాజరును తీసుకోవాలని సివిల్ సర్వీస్ కమిషన్ సర్క్యులర్ జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది సంఖ్య 50% మించకుండా పని గంటలను నిర్ణయించాలని కూడా తెలియజేసింది. ప్రైవేట్ రంగంలోనూ సిబ్బంది సంఖ్యను కనీస స్థాయికి తగ్గించాలని సూచించింది. నర్సరీలు, పిల్లల క్లబ్ లో పనిచేసే వారు తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ పూర్తి డోసులు పొంది ఉండాలి. జనవరి 12 నుండి ప్రజా రవాణాల కేవలం 50% మంది ప్రయాణికులతోనే నడువనున్నాయి. స్పోర్ట్స్ ఈవెంట్స్ లో పాల్గొనే వారు కచ్చితంగా వ్యాక్సిన్ వేసుకోవడంతో పాటు కరోనా నిబంధనలను పాటించాలి. సెలూన్లు, బార్బర్ షాపులు, హెల్త్ క్లబ్ల సిబ్బంది, వచ్చే వారు వ్యాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాల్సిందే. ప్రభుత్వ కార్యాలయాలు ఆన్లైన్ ద్వారా సేవలను అందించాలని, అపాయింట్మెంట్ ద్వారా మాత్రమే ఫిజికల్ అప్లికేషన్స్ తీసుకోవాలని సర్క్యులర్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- వాట్సాప్లోనే ఈ-ఆధార్ డౌన్లోడ్.. కొత్త సర్వీస్!
- హర్మూజ్ జలసంధిని తెరవాలని ఇరాన్కు 20 దేశాల విజ్ఞప్తి
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్









