50% స్టాఫ్ తోనే పని చేయనున్న గవర్నమెంట్ ఆఫీసులు
- January 11, 2022
కువైట్: కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వ కార్యాలయాలు 50% సిబ్బందితోనే పనిచేయనున్నాయి. ప్రైవేట్ కార్యాలయాలలో కూడా సిబ్బందిని తగ్గించాలని అదేశించారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో వేలిముద్రల వ్యవస్థను నిలిపివేసి, స్టేట్ మెంట్ తో హాజరును తీసుకోవాలని సివిల్ సర్వీస్ కమిషన్ సర్క్యులర్ జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది సంఖ్య 50% మించకుండా పని గంటలను నిర్ణయించాలని కూడా తెలియజేసింది. ప్రైవేట్ రంగంలోనూ సిబ్బంది సంఖ్యను కనీస స్థాయికి తగ్గించాలని సూచించింది. నర్సరీలు, పిల్లల క్లబ్ లో పనిచేసే వారు తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ పూర్తి డోసులు పొంది ఉండాలి. జనవరి 12 నుండి ప్రజా రవాణాల కేవలం 50% మంది ప్రయాణికులతోనే నడువనున్నాయి. స్పోర్ట్స్ ఈవెంట్స్ లో పాల్గొనే వారు కచ్చితంగా వ్యాక్సిన్ వేసుకోవడంతో పాటు కరోనా నిబంధనలను పాటించాలి. సెలూన్లు, బార్బర్ షాపులు, హెల్త్ క్లబ్ల సిబ్బంది, వచ్చే వారు వ్యాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాల్సిందే. ప్రభుత్వ కార్యాలయాలు ఆన్లైన్ ద్వారా సేవలను అందించాలని, అపాయింట్మెంట్ ద్వారా మాత్రమే ఫిజికల్ అప్లికేషన్స్ తీసుకోవాలని సర్క్యులర్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







