తెలంగాణలో కరోనా విజృంభణ..

- January 11, 2022 , by Maagulf
తెలంగాణలో కరోనా విజృంభణ..

హైదరాబాద్: తెలంగాణలో కోవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. రోజువారీ కేసులు ఆందోళనకర రీతిలో నమోదవుతున్నాయి. తెలంగాణలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. మరోసారి కొత్త కేసులు ఆందోళనకర రీతిలో పెరిగాయి. నిన్నటితో (1,825) పోలిస్తే 100 కేసులు పెరిగాయి.

గడిచిన 24 గంటల్లో 83వేల 153 కరోనా టెస్టులు చేయగా 1,920 మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. కరోనాతో మరో ఇద్దరు మరణించారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కోవిడ్ తో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,045కి చేరింది. మరోవైపు కోవిడ్ నుంచి 417 మంది పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16వేల 496 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,97,775కి చేరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com