తెలంగాణ క‌రోనా బులిటెన్‌..

- January 12, 2022 , by Maagulf
తెలంగాణ క‌రోనా బులిటెన్‌..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి.గడిచిన 24 గంటల్లో నిర్వహించిన 90,021 కరోనా పరీక్షలు చేయగా.. 2,319 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలిందని బుధ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ‌. తాజాగా న‌మోదైన కేసుల‌తో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,00,094కి చేరిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.గడిచిన 24 గంటల్లో క‌రోనాతో ఇద్ద‌రు మృతి చెందగా.. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 4,047కు చేరింది.గ‌డిచిన 24 గంట‌ల్లో 474 మంది కోలుకున్నారు.దీంతో ఇప్ప‌టివ‌ర‌కూ కోలుకున్న‌వారి సంఖ్య 6,77,708కు చేరాయి. ఇక‌ ప్రస్తుతం రాష్ట్రంలో 18,339 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com