భారత్లో విజృంభిస్తున్న కరోనా..
- January 14, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకూ భారీగా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో రోజువారీ కరోనా కేసులు 2.62 లక్షలకు చేరగా, మూడు వందలకు పైగా మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కొత్తగా 46,406 కేసులు, 36 మరణాలు నమోదు అయ్యాయి. ఢిల్లీలో కొత్తగా 28,867 కేసులు, 31 మరణాలు నమోదు అయ్యాయి.
కర్ణాటకలో కొత్తగా 25,005 కేసులు నమోదు కాగా, 8 మంది మృతి చెందారు. పశ్చిమ బెంగాల్లో కొత్తగా 23,467 కేసులు, 26 మరణాలు నమోదు అయ్యాయి. తమిళనాడులో కొత్తగా 20,911 కేసులు నమోదవ్వగా, 25 మంది మృతి చెందారు. ఉత్తర్ ప్రదేశ్ లో కొత్తగా 14,765 కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో కరోనా బారిన పడి ఆరుగురు మృతి చెందారు.
కేరళలో కొత్తగా 13,468 కేసులు నమోదు కాగా, 21 మంది మృతి చెందారు.గుజరాత్లో కొత్తగా 11,176 కేసులు నమోదవ్వగా, ఐదుగురు మృతి చెందారు.రాజస్థాన్లో కొత్తగా 9981 కేసులు అయ్యాయి. గత 24 గంటల్లో వైరస్ బారిన పడి ఏడుగురు మరణించారు.
పంజాబ్ లో కొత్తగా 6083 కేసులు నమోదు కాగా, ఆరుగురు మృతి చెందారు.ఏపీలో కొత్తగా 4348 కేసులు నమోద్వవగా, ఇద్దరు చనిపోయారు. తెలంగాణలో కొత్తగా 2707 కేసులు, రెండు మరణాలు నమోదు అయ్యాయి.
తాజా వార్తలు
- వైభవంగా ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక.. చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్ సందడి..
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్కోచ్లు వీళ్లే
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు









