కోవిడ్ రూల్స్ పాటించని సంస్థలకు భారీగా ఫైన్
- January 14, 2022
సౌదీ: కొత్త కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సౌదీ అరేబియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్ని ప్రైవేట్ రంగ సంస్థలను కోరింది. లేదంటే భారీగా జరిమానాలు విధించబడతాయని హెచ్చరించింది. ఎంట్రీ సమయంలో శరీర ఉష్ణోగ్రతను తనిఖీ చేయడం, వ్యాక్సిన్ వేసుకోని లేదా కోవిడ్-పాజిటివ్ వ్యక్తులను అనుమతించడం, సోషల్ డిస్టెన్స్ లేకపోవడం, మాస్కులు పెట్టుకోకపోవడం వంటి కరోనా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా నిబంధనలను పాటించని చిన్న సంస్థలకు SR10,000.. పెద్ద వాటికి SR100,000 వరకు జరిమానాలు విధించబడతాయి. ఉల్లంఘనలు పునరావృతం అయితే ఆయా సంస్థలకు SR200,000 వరకు పెనాల్టీతోపాటు ఆరు నెలల మూసివేతను మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







