సికింద్రాబాద్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం
- January 16, 2022హైదరాబాద్: హైదరాబాద్, జూబ్లీ బస్ స్టేషన్ సమీపంలోని సికింద్రాబాద్ క్లబ్ లో ఆదివారం తెల్లవారు ఝామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తెల్లవారు ఝామున 3 గంటల సమయంలో క్లబ్ లో మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసి పడటంతో క్లబ్ మొత్తం పూర్తిగా తగలబడిపోయింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్ధలానికి వచ్చి మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. సుమారు 10 అగ్నిమాపక యంత్రాలు అగ్నికీలలను అదుపు చేశాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం తెల్లవారుఝామున జరగటంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఈ అగ్నిప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సికింద్రాబాద్ క్లబ్లో రూ. 15 లక్షలు కడితేనే మెంబర్షిప్ లభిస్తుంది.1878లో బ్రిటీష్ హయాంలో మిలటరీ అధికారుల కోసం నవాబ్ మీర్ మహబూబ్ అలీఖాన్ సికింద్రాబాద్ క్లబ్ ను నిర్మించారు.ఈ తెల్లవారు ఝామున జరిగిన అగ్నిప్రమాదంలో ప్రధాన భవనం పూర్తిగా కాలిపోయింది. ఈ భవనంలోనే కిచెన్ తో పాటు క్లబ్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?