ఏపీలో మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు..
- January 19, 2022
అమరావతి: ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. తాజాగా ఈ సంఖ్య పది వేలు దాటింది. గత 24 గంటల్లో 41వేల 713 మంది శాంపిల్స్ పరీక్షించగా, పదివేల 57 మంది కోవిడ్ బారిన పడినట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది.
ఏపీలో ఒకరోజులో పదివేలకు పైగా కేసులు వెలుగుచూడడం ఇదే తొలిసారి. కోవిడ్ వల్ల విశాఖలో ముగ్గురు.. చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. మరో 1222 మంది కోవిడ్ నుంచి కోలుకున్నట్లు తెలిపింది.
నిన్నటితో పోలిస్తే ఈ రోజు కోవిడ్ కేసులు మూడువేలకు పైగా పెరిగాయి. విశాఖలో అత్యధికంగా 1827 పాజిటివ్ కేసులు వచ్చాయి. చిత్తూరులో 1822, గుంటూరులో 943, తూర్పు గోదావరి జిల్లాలో 919 కోవిడ్ బారిన పడగా అత్యత్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 216 కోవిడ్ కేసులు వెలుగు చూశాయి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి