భారత్ కరోనా అప్డేట్
- January 21, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ కట్టడికి దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు ఎన్ని ఆంక్షలు విధించినా కరోనా పాజిటివ్ కేసులు మాత్రం కట్టడి కావడం లేదు. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,47,254 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గురువారంతో పోలిస్తే దాదాపు 30వేల కేసులు అధికంగా నమోదయ్యాయి. తాజాగా 703 మంది మరణించారు. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,85,66, 027కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 4,88,396కి చేరుకుంది.
మరోవైపు దేశంలో గడిచిన 24 గంటల్లో 2,51,777 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం 20,18,825 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 17.94 శాతానికి పెరిగింది. అటు భారత్ వ్యాప్తంగా ఓమిక్రాన్ కేసుల సంఖ్య 9,692గా నమోదైంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,60,43,70,484 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 70,49,779 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి