అంతరాష్ట్ర దొంగల ముఠా గుట్టురట్టు చేసిన రాచకొండ పోలీస్
- January 22, 2022
హైదరాబాద్: హైదరాబాద్ లో దొంగలు రెచ్చిపోతున్నారు. చైన్ స్నాచర్లు గొలుసులు ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఎల్బీనగర్ సంతోషి మాత దేవాలయంలో జరిగిన చోరీ కేసును ఛేదించామన్నారు రాచకొండ కమిషనర్ మహేష్ భగత్. డిసెంబర్ 3, 4 తేదీలలో దేవాలయంలో అమ్మవారి నగలు చోరీ గురయ్యాయని ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టాం.సీసీటీవీ కెమేరాలతో పాటు దర్యాప్తు చేపట్టాం అన్నారు. ఇది అంతరాష్ట్ర దొంగల పని అని గుర్తించామన్నారు.
ఐటి, సైబర్ క్రైమ్, స్పెషల్ టీమ్స్ తో గాలింపు చేపట్టాం. అంతరాష్ట్ర దొంగల ముఠా గ్యాంగ్ 5 సభ్యులను గుర్తించాం. ఇందులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసాము. ఈ గ్యాంగ్ లో గుంటూరు జిల్లా కు చెందిన పొన్నూరి చిన్న సత్యానంద్ అలియాస్ సతీష్. మాండ్ల నాగేందర్ మరో నిందితుడు పరారీలో ఉన్నారని మహేష్ భగత్ తెలిపారు.

మొత్తం 19 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నాం.నిందితుల నుండి 215 గ్రాముల బంగారం, ఒక కారు, ఒక బుల్లెట్ వాహనం.నిందితుల పై రెండు తెలుగు రాష్ట్రాల 10 కేసులు నమోదు అయ్యాయి.గతంలో నాలుగు దేవాలయాల్లో చోరీలు చేశారు. నిందితులు దేవలయాలతో పాటు హౌస్ బ్రోకింగ్, ఆటో మొబైల్స్ కేసులు కూడా ఉన్నాయని రాచకొండ సీపీ తెలిపారు.

తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









