చిరంజీవి, పవన్ కల్యాణ్ అభిమానుల మధ్య తగాదా విషాదానికి దారి...
- March 28, 2016
రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానుల మధ్య తగాదా విషాదానికి దారి తీసింది. ఈ గొడవలో ఓ వ్యక్తి మరణించినట్లు స్థానికంగా వెలుగు చూసింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.పోలీసుల కథనం ఆధారంగా స్థానిక మీడియాలో ఇందుకు సంబంధించిన వార్తలు వచ్చాయి. కర్ణాటకలోని బళ్లారి ఆ సంఘటన జరిగింది. బళ్లారి నగరంలోని కౌల్ బజార్కు చెందిన ఇద్దరు యువకులు ఈ నెల 20వ తేదీన ఓ చోట కలిశారు. వీరిలో ఒకతను పవన్ కల్యాణ్ అభిమాని కాగా, మరొకతను చిరంజీవి అభిమాని.చిరంజీవి అభిమాని మరో వ్యక్తితో వాదనకు దిగాడు. తమ అన్న మెగాస్టార్ను మించిన హీరో ఎవరూ లేరని వాదించాడు. దీంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. ఇది కాస్తా దాడికి దారి తీసింది. చిరంజీవి అభిమాని పవన్ కల్యాణ్ అభిమానిని ఇనుప రాడ్తో కొట్టాడు. దీంతో పవన్ కల్యాణ్ అభిమాని అక్కడికక్కడే మరణించాడు.
తాజా వార్తలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..







