చిరంజీవి, పవన్ కల్యాణ్ అభిమానుల మధ్య తగాదా విషాదానికి దారి...
- March 28, 2016
రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానుల మధ్య తగాదా విషాదానికి దారి తీసింది. ఈ గొడవలో ఓ వ్యక్తి మరణించినట్లు స్థానికంగా వెలుగు చూసింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.పోలీసుల కథనం ఆధారంగా స్థానిక మీడియాలో ఇందుకు సంబంధించిన వార్తలు వచ్చాయి. కర్ణాటకలోని బళ్లారి ఆ సంఘటన జరిగింది. బళ్లారి నగరంలోని కౌల్ బజార్కు చెందిన ఇద్దరు యువకులు ఈ నెల 20వ తేదీన ఓ చోట కలిశారు. వీరిలో ఒకతను పవన్ కల్యాణ్ అభిమాని కాగా, మరొకతను చిరంజీవి అభిమాని.చిరంజీవి అభిమాని మరో వ్యక్తితో వాదనకు దిగాడు. తమ అన్న మెగాస్టార్ను మించిన హీరో ఎవరూ లేరని వాదించాడు. దీంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. ఇది కాస్తా దాడికి దారి తీసింది. చిరంజీవి అభిమాని పవన్ కల్యాణ్ అభిమానిని ఇనుప రాడ్తో కొట్టాడు. దీంతో పవన్ కల్యాణ్ అభిమాని అక్కడికక్కడే మరణించాడు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









