రాష్ట్ర ఉగాది వేడుకలు విజయవాడలో..

- March 28, 2016 , by Maagulf
రాష్ట్ర ఉగాది వేడుకలు విజయవాడలో..

విజయవాడలోని ఏ-కన్వెన్షన్ సెంటర్‌లో ఏప్రిల్ 8న రాష్ట్రస్థాయి ఉగాది పర్వదిన వేడుకల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.అమరావతి నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగిన ఉద్ధండ్రాయునిపాలెంలో వీటిని నిర్వహించాలని మొదట్లో భావించిన సర్కారు.. వేదికను విజయవాడకు మారుస్తూ ఆదివారం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మనుమడు దేవాన్ష్ బర్త్‌డే వేడుకలనూ ఇదే వేదికపై నిర్వహిస్తామని సీఎం ప్రకటించడంతో ఉగాది వేడుకల వేదికను భద్రత దృష్ట్యా విజయవాడకు మార్చినట్లు సమాచారం. గతేడాది ప్రభుత్వం ఉగాది వేడుకలు గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరంలో నిర్వహించింది.ఈసారి కూడా అమరావతిలోనే రైతుల మధ్య నిర్వహించాలనుకున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కూ సూచనలందాయి.ఉద్ధండ్రాయునిపాలెంలో నిర్వహించడం వల్ల రోడ్లు, హెలీప్యాడ్లు, పార్కింగ్ సమస్యలు ఉండబోవనీ,ఏర్పాట్లకు అయ్యే ఖర్చు తగ్గుతుందని సర్కారు భావించింది. అయితే ఉగాది రోజున పుట్టిన తన మనుమడు దేవాన్ష్ బర్త్‌డేను ఉగాది వేడుకల్లోనే నిర్వహిస్తామని శనివారం సీఎం ప్రకటించడంతో మార్పు జరిగింది. 60 మందికి కళారత్న, ఉగాది పురస్కారాలు.. ఉగాది వేడుకల్లో భాగంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు కళారత్న (హంస), పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.16 రంగాలకు చెందినవారినిఎంపిక చేసి వీటిని అందజేస్తారు. ఇందుకోసం రెండ్రోజుల్లో అవార్డుల ఎంపిక కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com