తెలంగాణకు 8 మెడికల్ కాలేజీలు మంజూరు
- January 26, 2022
తెలంగాణ: రాజ్ భవన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ జండా ఆవిష్కరించారు గవర్నర్ తమిళ్ సై సౌందర రాజన్. అనంతరం.. గవర్నర్ తమిళ్ సై మాట్లాడుతూ.. ప్రధాని మోడీ జిల్లాకు మెడికల్ కాలేజి ఇస్తున్నారని.. ఇందులో భాగంగానే.. తెలంగాణ రాష్ట్రానికి 8 మెడికల్ కాలేజి లు మంజూరు అయ్యాయని చెప్పారు.

మరుగున పడిన వ్యక్తులను గౌరవించడం ద్వారా భారతదేశం తన నిజమైన చరిత్రను వారసత్వాన్ని తిరిగి పొందుతుందని.. 150 దేశాలకు భారతదేశం వ్యాక్సిన్ ఇచ్చిందని తెలిపారు. మన దేశం ఫార్మసీ, వ్యాక్సిన్ కాపిటల్ ఆఫ్ వరల్డ్ గా పిలువబడుతుందని.. మోడీ కృషి వల్ల ప్రపంచ దేశాల్లో భారతదేశం ఒక శక్తివంతమైన దేశంగా ఇచ్చిందని చెప్పారు.
కొత్త రాష్ట్రము అయిన తెలంగాణ వివిధ రంగాల్లో దూసుకుపోతుందని.. హైదరాబాద్ ఫార్మా, మెడికల్,ఐటీ హబ్ గా మారిందని చెప్పారు. నాణ్యమైన ఉన్నత విద్యలో తెలంగాణ అగ్రగామిగా ఎదగాలని, ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్ ని ప్రోత్సహించి ఇన్నోవేషన్ హబ్ గా తెలంగాణ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని కోరుకొంటున్నానని వెల్లడించారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







