తెలంగాణకు 8 మెడికల్ కాలేజీలు మంజూరు
- January 26, 2022
తెలంగాణ: రాజ్ భవన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ జండా ఆవిష్కరించారు గవర్నర్ తమిళ్ సై సౌందర రాజన్. అనంతరం.. గవర్నర్ తమిళ్ సై మాట్లాడుతూ.. ప్రధాని మోడీ జిల్లాకు మెడికల్ కాలేజి ఇస్తున్నారని.. ఇందులో భాగంగానే.. తెలంగాణ రాష్ట్రానికి 8 మెడికల్ కాలేజి లు మంజూరు అయ్యాయని చెప్పారు.

మరుగున పడిన వ్యక్తులను గౌరవించడం ద్వారా భారతదేశం తన నిజమైన చరిత్రను వారసత్వాన్ని తిరిగి పొందుతుందని.. 150 దేశాలకు భారతదేశం వ్యాక్సిన్ ఇచ్చిందని తెలిపారు. మన దేశం ఫార్మసీ, వ్యాక్సిన్ కాపిటల్ ఆఫ్ వరల్డ్ గా పిలువబడుతుందని.. మోడీ కృషి వల్ల ప్రపంచ దేశాల్లో భారతదేశం ఒక శక్తివంతమైన దేశంగా ఇచ్చిందని చెప్పారు.
కొత్త రాష్ట్రము అయిన తెలంగాణ వివిధ రంగాల్లో దూసుకుపోతుందని.. హైదరాబాద్ ఫార్మా, మెడికల్,ఐటీ హబ్ గా మారిందని చెప్పారు. నాణ్యమైన ఉన్నత విద్యలో తెలంగాణ అగ్రగామిగా ఎదగాలని, ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్ ని ప్రోత్సహించి ఇన్నోవేషన్ హబ్ గా తెలంగాణ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని కోరుకొంటున్నానని వెల్లడించారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







