లాహోర్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య 72కు ..

- March 28, 2016 , by Maagulf
లాహోర్‌లో  జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య 72కు ..

పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య 72కు చేరింది. ఈస్టర్‌ సందర్భంగా ఓ ప్రముఖ పార్కు దగ్గర జరిగిన ఈ ఘటనలో 69 మంది మృతిచెందగా.. 300 మంది గాయపడ్డారు. సోమవారం నాటికి మృతుల సంఖ్య 72కు చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ దాడికి పాల్పడింది తామేనంటూ జమాతుల్‌ అహ్రర్‌ అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. దాడి నేపథ్యంలో ఈ రోజు లాహోర్‌లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com