58 మందికి పద్మ అవార్డులను ప్రదానం

- March 28, 2016 , by Maagulf
58 మందికి పద్మ అవార్డులను ప్రదానం

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో సోమవారం పద్మ అవార్డుల ప్రదాన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా 58 మందికి పద్మ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యకర్మానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు. దివంగత ధీరూభాయ్ అంబానీకి పద్మవిభూషన్ అవార్డును ప్రదానం చేశారు. ఆయన భార్య కోకిలా బెన్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు.. 5 మందికి పద్మవిభూషన్, 8 మందికి పద్మభూషన్, 45 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రదానం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com