భారత్ కరోనా అప్డేట్
- January 27, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. తాజాగా దేశంలో గడిచిన 24 గంటల్లో 2,86,384 కేసులు నమోదవ్వగా, 573 మంది కరోనాతో మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్లో పేర్కొన్నది. దేశంలో గడిచిన 24 గంటల్లో 3,06,357 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్త కేసుల కంటే రికవరీ కేసులు కాస్త పెరగడం ఊటరనిచ్చేవిషయం. ఇక దేశంలో 22,02,472 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 19.59శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశంలో 163,84,39,207 మందికి వ్యాక్సినేషన్ అందించారు. మూడో డోస్ కొనసాగుతోంది.
దేశంలో వీలైనంత త్వరగా రెండో డోసు కార్యక్రమం పూర్తి చేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ప్రస్తుతం హెల్త్ వర్కర్లు, కరోనా ఫ్రంట్లైన్ వారియర్స్, 60 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఆరోగ్యసమస్యలు ఉన్న వారికి వైద్యుల సలహా మేరకు ప్రైవేటులో మూడో డోసు అందిస్తున్నారు. థర్డ్ వేవ్ ఉధృతి అధికంగా ఉన్నప్పటికీ తీవ్రత తక్కువగా ఉండటంతో కరోనా బారిన పడినా త్వరగా కోలుకుంటున్నారు.
తాజా వార్తలు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..
- శ్రీశైలంలో అగ్ని ప్రమాదం, భక్తులకు తప్పిన పెను ప్రమాదం
- హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులకు రమదాన్ అనుభవం..!!
- కువైట్ టవర్స్: జాతీయ గుర్తింపుకు శాశ్వత చిహ్నం..!!
- ఉగ్రవాద సైబర్ దాడిని భగ్నం చేసిన యూఏఈ..!!
- బహ్రెయిన్ను లో మగ్రిబ్ డేట్స్ కు ఫుల్ డిమాండ్..!!
- 'మరూఫ్ ఒమన్' ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ బలోపేతం..!!
- అమెరికా రాయబారి వ్యాఖ్యలను ఖండించిన సౌదీ అరేబియా..!!
- లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి..10 మంది మృతి









