వారం పాటు మెగా సేల్ కార్నివాల్ : ఎయిర్ ఏషియా
- March 28, 2016
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా, ఎయిర్ ఏషియా ఎక్స్ వారం పాటు మెగా సేల్ కార్నివాల్ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. రేపటి నుంచి ఏప్రిల్ 3 వరకు అతి తక్కువ ధరలకే ప్రయాణికులకు విమానయాన సౌకర్యాన్ని కల్పిస్తోంది. డొమెస్టిక్ విమాన సర్వీసులకు రూ.1,099, అంతర్జాతీయ విమాన సర్వీసులను రూ.2,999 కనీస టికెట్ ధరను నిర్ణయించింది. ఈ మెగాసేల్లో టికెట్లు కొనుక్కున్న ప్రయాణికులు జూన్ 1 నుంచి నవంబర్ 24 లోపల ఎప్పుడైనా ప్రయాణించవచ్చు.ఈ సందర్భంగా ఎయిర్ఏషియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ తేహ్ మాట్లాడుతూ ఈ మెగా సేల్ ద్వారా 22 దేశాల్లోని 100 గమ్యస్థానాల్లో ఎక్కడికైనా ప్రయాణించవచ్చన్నారు.
జైపూర్, కొచ్చి, పుణె, వైజాగ్, గువాహటి, బెంగళూరు, న్యూదిల్లీ ఒక సారి వెళ్లడానికి రూ.1,099 టికెట్ ధరగా నిర్ణయించారు. కొచ్చి నుంచి బెంగళూరుకి రూ.2,999, బాలి రూ.6,299, సింగపూర్ రూ.5,899, మకావు రూ.9,299, ఫుకెట్ రూ.7,799, పెర్త్ రూ.13,399గా నిర్ణయించారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









