వారం పాటు మెగా సేల్ కార్నివాల్ : ఎయిర్ ఏషియా
- March 28, 2016
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా, ఎయిర్ ఏషియా ఎక్స్ వారం పాటు మెగా సేల్ కార్నివాల్ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. రేపటి నుంచి ఏప్రిల్ 3 వరకు అతి తక్కువ ధరలకే ప్రయాణికులకు విమానయాన సౌకర్యాన్ని కల్పిస్తోంది. డొమెస్టిక్ విమాన సర్వీసులకు రూ.1,099, అంతర్జాతీయ విమాన సర్వీసులను రూ.2,999 కనీస టికెట్ ధరను నిర్ణయించింది. ఈ మెగాసేల్లో టికెట్లు కొనుక్కున్న ప్రయాణికులు జూన్ 1 నుంచి నవంబర్ 24 లోపల ఎప్పుడైనా ప్రయాణించవచ్చు.ఈ సందర్భంగా ఎయిర్ఏషియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ తేహ్ మాట్లాడుతూ ఈ మెగా సేల్ ద్వారా 22 దేశాల్లోని 100 గమ్యస్థానాల్లో ఎక్కడికైనా ప్రయాణించవచ్చన్నారు.
జైపూర్, కొచ్చి, పుణె, వైజాగ్, గువాహటి, బెంగళూరు, న్యూదిల్లీ ఒక సారి వెళ్లడానికి రూ.1,099 టికెట్ ధరగా నిర్ణయించారు. కొచ్చి నుంచి బెంగళూరుకి రూ.2,999, బాలి రూ.6,299, సింగపూర్ రూ.5,899, మకావు రూ.9,299, ఫుకెట్ రూ.7,799, పెర్త్ రూ.13,399గా నిర్ణయించారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







