తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- January 27, 2022
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు.రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. వివిధ జిల్లాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది.బుధవారం 3 వేల 801 పాజిటివ్ కేసులు ఉంటే.. గత 24 గంటల్లో 3 వేల 944 కేసులు నమోదయ్యాయని, ముగ్గురు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం 39 వేల 520 యాక్టివ్ కేసులుండగా..మొత్తం 4 వేల 081 మంది చనిపోయారని పేర్కొంది. అలాగే…ఒక్కరోజులో 2 వేల 444 మంది ఆరోగ్యవంతంగా కోలుకున్నారని..ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 7,07,498 ఉందని పేర్కొంది.
జిల్లాల వారీగా కేసులు :
ఆదిలాబాద్ 40, భద్రాద్రి కొత్తగూడెం 101, జీహెచ్ఎంసీ 1372, జగిత్యాల 67, జనగాం 40, జయశంకర్ భూపాలపల్లి 42, జోగులాంబ గద్వాల 40, కామారెడ్డి 43, కరీంనగర్ 80, ఖమ్మం 135, కొమురం భీమ్ ఆసిఫాబాద్ 19, మహబూబ్ నగర్ 79, మహబూబాబాద్ 45, మంచిర్యాల 76, మెదక్ 60, మేడ్చల్ మల్కాజ్ గిరి 288, ములుగు 26, నాగర్ కర్నూలు 59, నల్గొండ 91, నారాయణపేట 12, నిర్మల్ 41, నిజామాబాద్ 105, పెద్దపల్లి 95, రాజన్న సిరిసిల్ల 48, రంగారెడ్డి 259, సంగారెడ్డి 120, సిద్ధిపేట 104, సూర్యాపేట 66, వికారాబాద్ 56, వనపర్తి 64, వరంగల్ రూరల్ 78, హన్మకొండ 117, యాదాద్రి భువనగిరి 76. మొత్తం : 3,944
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







