ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్
- February 24, 2026
అమెరికా: అమెరికా సుప్రీంకోర్టు వెలువరించిన ఒక కీలక తీర్పు ఇప్పుడు అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ తీర్పును సాకుగా చూపుతూ కొన్ని దేశాలు అమెరికాతో ఉన్న సంబంధాలను, ఒప్పందాలను పునఃసమీక్షించుకోవాలని చూస్తున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా ఏ దేశమైనా “గేమ్స్” ఆడితే ఊరుకునేది లేదని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. సుప్రీంకోర్టు తీర్పును అడ్డంపెట్టుకుని అమెరికాను బ్లాక్మెయిల్ చేయాలని చూడవద్దని ఆయన సూచించారు.ముఖ్యంగా అమెరికా ను దశాబ్దాలుగా టారిఫ్స్తో పీడించిన దేశాలకు గతంలో కంటే ఎక్కువ టారిఫ్స్ విధిస్తానని వార్నింగ్ ఇచ్చారు.
సుప్రీంకోర్టు ఈ తీర్పు ద్వారా తెలియకుండానే తనకు మరిన్ని అధికారాలు కట్టబెట్టిందని వ్యాఖ్యానించారు. కొన్ని దేశాలు అమెరికాను దశాబ్దాలుగా కొల్లగొట్టాయని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పును ఆధారంగా చేసుకుని, ఇష్టానుసారం వ్యవహరించాలని చూస్తే ఇటీవల అంగీకరించిన సుంకాల కంటే భారీగా ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తన ట్రూత్ సోషల్ మీడియాలో ఈ హెచ్చరిక జారీ చేశారు.అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టంను ఉపయోగించి డొనాల్డ్ ట్రంప్ తన మాట వినని వివిధ దేశాలపై అధిక పన్ను విధించారు. ట్రంప్ అధిక సుంకాలకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం లేదు. టారిఫ్ అంశం సుప్రీంకోర్టుకు వెళ్లగా, ట్రంప్ తీరును తప్పుబట్టింది. ఆయన నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పు వెలువరించింది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









