తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- January 27, 2022హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు.రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. వివిధ జిల్లాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది.బుధవారం 3 వేల 801 పాజిటివ్ కేసులు ఉంటే.. గత 24 గంటల్లో 3 వేల 944 కేసులు నమోదయ్యాయని, ముగ్గురు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం 39 వేల 520 యాక్టివ్ కేసులుండగా..మొత్తం 4 వేల 081 మంది చనిపోయారని పేర్కొంది. అలాగే…ఒక్కరోజులో 2 వేల 444 మంది ఆరోగ్యవంతంగా కోలుకున్నారని..ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 7,07,498 ఉందని పేర్కొంది.
జిల్లాల వారీగా కేసులు :
ఆదిలాబాద్ 40, భద్రాద్రి కొత్తగూడెం 101, జీహెచ్ఎంసీ 1372, జగిత్యాల 67, జనగాం 40, జయశంకర్ భూపాలపల్లి 42, జోగులాంబ గద్వాల 40, కామారెడ్డి 43, కరీంనగర్ 80, ఖమ్మం 135, కొమురం భీమ్ ఆసిఫాబాద్ 19, మహబూబ్ నగర్ 79, మహబూబాబాద్ 45, మంచిర్యాల 76, మెదక్ 60, మేడ్చల్ మల్కాజ్ గిరి 288, ములుగు 26, నాగర్ కర్నూలు 59, నల్గొండ 91, నారాయణపేట 12, నిర్మల్ 41, నిజామాబాద్ 105, పెద్దపల్లి 95, రాజన్న సిరిసిల్ల 48, రంగారెడ్డి 259, సంగారెడ్డి 120, సిద్ధిపేట 104, సూర్యాపేట 66, వికారాబాద్ 56, వనపర్తి 64, వరంగల్ రూరల్ 78, హన్మకొండ 117, యాదాద్రి భువనగిరి 76. మొత్తం : 3,944
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు