భారత్ కరోనా అప్డేట్
- January 28, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతున్నది. గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా దేశంలో 2,51,209 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్లో పేర్కొన్నది.ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 627 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య నిన్నటి కంటే స్వల్పంగా పెరిగింది. అయితే,కోలుకున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్టు ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. 24 గంటల వ్యవధిలో 3,47,443 మంది కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్లో పేర్కొన్నది. దేశలో ప్రస్తుతం 21,05,611 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 15.88శాతంగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 164,44,73,216 వ్యాక్సిన్ డోసులు అందించారు. మూడో వేవ్ కారణంగా ప్రికాషనరీ డోస్ను అందిస్తున్నారు. కరోనా మహమ్మారికి అందిస్తున్న కోవీషీల్డ్, కోవాగ్జిన్లు బహిరంగ మార్కెట్లో విక్రయించేందుకు షరతులతో కూడిన అనుమతులు కేంద్రం మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- DTC delivers strong FY 2025 revenue growth of 13% YoY to AED 2.47bln
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!









