అవినీతి న్యాయమూర్తులకు కఠినమైన జరీమానాలు: ప్రాసిక్యూషన్
- January 29, 2022
కువైట్: న్యాయమూర్తుల అవినీతికి సంబంధించి కోర్టు ఆఫ్ అప్పీల్ ఫిబ్రవరి 9న విచారణ జరపనుంది. జడ్జిలు, లాయర్లు, వ్యాపరవేత్తలు ఓ కేసులో నిందితులుగా తేలారు. వీరికి కింది న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ఖరీదైన వాహనాల్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ కేసులో కఠినమైన జరీమానాలు విధించాల్సిందిగా ప్రాసిక్యూషన్ న్యాయస్థానాన్ని కోరడం జరిగింది. అభియోగాలు మోపబడిన ఆరుగురు న్యాయమూర్తుల్లో నలుగురు సరెండర్ అయిపోయారు. తమను విడుదల చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అయితే, కోర్టు ఆ విజ్ఞప్తిని తిరస్కరించింది. దోషులకు 4 నుంచి 15 ఏళ్ళ వరకు జైలు శిక్ష విధించింది. కాగా, జరీమానాలు 9000 నుంచి 400,000 దినార్ల వరకు విధించడం జరిగింది.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







