25శాతం ప్రేక్షకులతో ఐపీఎల్ మ్యాచ్లు
- January 30, 2022
ముంబై: ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశీవాలీ లీగ్.. 15వ సీజన్ కు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. వరుసగా మూడో ఏడాది పీడిస్తున్న కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా స్టేడియంలోకి అభిమానులను అనుమతించడం శోచనీయాంశమైపోయింది. దాదాపు స్టేడియాల్లోనికి ఎవరూ రావొద్దని సూచించినా.. ప్రస్తుతం 25శాతం కెపాసిటీతో మ్యాచ్ లు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట.
మొత్తం నాలుగు వేదికలుగా జరగనున్న లీగ్.. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ప్లేఆఫ్ లు జరగనున్నాయి. వాంఖడే స్టేడియం, బ్రబౌర్న్ స్టేడియం, డీవై పాటిల్ స్టేడియంలలో లీగ్ మ్యాచ్ లు జరగనున్నాయి. రెండు కొత్త జట్లతో నిర్వహించే లీగ్ మ్యాచ్ లు మొత్తం 70 జరుగుతాయి. అదే సమయంలో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నాలుగు ప్లేఆఫ్ మ్యాచ్ లు జరగనున్నాయి.
వేదికలు ఇంకా కన్ఫామ్ కాకపోయినప్పటికీ కనీసం 25శాతం ప్రేక్షకులతో మ్యాచ్ లు జరుగుతాయి. ముంబై, పూణెలలో కేసుల నమోదు తగ్గితేనే అభిమానులను స్టేడియాల్లోకి అనుమతించే విషయం ఫైనల్ కాదని కొన్ని వర్గాలు చెబుతున్నాయి.
మార్చి చివరి వారంలో మొదలుకావాల్సి ఉన్న ఐపీఎల్ 2022.. రెండు నెలల పాటు జరగనుంది. దాని కంటే ముందు ఫిబ్రవరి 12, 13న మెగా వేలం నిర్వహిస్తుంది ఐపీఎల్ మేనేజ్మెంట్.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







