భారత వాయు సేన సాహసయాత్ర
- March 28, 2016
భారత వాయుసేనకు చెందిన పైలట్లు ఓపెన్ కాక్పిట్లో 10 వేల కిలో మీటర్లు ప్రయాణించి సరికొత్త జాతీయ రికార్డును నెలకొల్పారు. 14 మందితో కూడిన పైలట్ల బృందం పారామోటర్తో ఈ సాహసయాత్ర చేపట్టింది. ఫిబ్రవరి 1న పశ్చిమ్బంగలోని కలైకుందా ఎయిర్బేస్ నుంచి వీరి ప్రయాణం ప్రారంభమైంది. దేశంలోని వివిధ ప్రాంతాలను చుట్టి.. మొత్తం పది వేల కిలోమీటర్లు ప్రయాణించి గత శనివారం వారు తిరిగి ఎయిర్బేస్కు చేరుకున్నారు. ఎంపీఎస్ సోలంకీ నేతృత్వంలోని ఈ బృందం.
గతంలో ఉన్న 9,132 కి.మీల రికార్డును అధిగమించింది. ఈ బృందం కన్యాకుమారి, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హిమాలయపర్వతాలు, దిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్ల మీదుగా ప్రయాణించి కలైకుందా చేరుకుంది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







