డ్రగ్స్‌ను నిర్మూలించే ప్రణాళికను సిద్ధం చేస్తున్న తెలంగాణ పోలీసులు

- February 02, 2022 , by Maagulf
డ్రగ్స్‌ను నిర్మూలించే ప్రణాళికను సిద్ధం చేస్తున్న తెలంగాణ పోలీసులు

హైదరాబాద్: తెలంగాణలో డ్రగ్స్‌ను నిర్మూలించే ప్రణాళికను పోలీసులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 1000 మంది సిబ్బందితో రాష్ట్ర వ్యాప్తంగా నూతన విభాగం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

హైదరాబాద్ సిటీలో కొత్తగా నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ డ్రగ్స్ నిర్మూలన కోసం నగర సీపీ ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. అడిషనల్ డీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్‌లతో నిరంతరం డ్రగ్స్‌పై నిఘా పెట్టారు. ఇప్పటికే ఇద్దరు ఇన్స్పెక్టర్‌లను నియమిస్తూ సీపీ ఆదేశాలు జారీ చేశారు. వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజేష్‌తో పాటు వెయిటింగ్‌లో ఉన్న రమేష్ రెడ్డిలను నియమిస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. డ్రగ్స్‌ను వెంటనే పసిగట్టే అత్యాధునిక పరికరాలను అధికారులు పరిశీలిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com