మంత్రి కేటీఆర్కు బహిరంగ లేఖ రాసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్
- February 02, 2022
హైదరాబాద్: మంత్రి కేటీఆర్ కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా మారుస్తామన్న టీఆర్ఎస్ ప్రభుత్వ హామీని లేఖలో ప్రస్తావించారు. 8 ఏళ్లుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్.. ఎన్నికల సమయంలో హైదరాబాద్ ను విశ్వ నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారని గుర్తు చేశారు. కానీ కనీసం కాలుష్యం లేని నగరంగా కూడా చేయలేక పోయారని విమర్శించారు. మహానగరం సంగతి అటు ఉంచితే కనీసం జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ విషయంలో కూడా మీ హామీ నెరవేరలేదన్నారు. మూడేళ్ళ క్రితం ఇక్కడ నుంచి డంపింగ్ యార్డ్ మారుస్తామని చెప్పిన మీ హామీ ఇంతవరకు నెరవేరలేదని అన్నారు.
కల్వకుంట్ల వారి మాటలు కోటలు దాటుతాయ్ కానీ పనులు గడప దాటవన్న నానుడి మరోసారి రుజువు చేసుకున్నారని ఎద్దేవా చేశారు. తన పార్లమెంట్ పరిధిలోని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వల్ల విష వాయువులు వెలుబడి ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడిందన్నారు. భూగర్భ జలాలు కూడా కలుషితమవుతున్నాయని మీకు జాయింట్ అక్షన్ కమిటీ అనేక సార్లు చెప్పిందని తెలిపారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు మీరు ఇచ్చిన హామీని సైతం పక్కన పెట్టి మొద్దు నిద్ర పోతున్నారని విమర్శించారు. ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపడం, అద్భుత ప్రపంచాలు కోరుకోవడం లేదన్నారు. స్వచ్ఛమైన గాలి, మంచి వాతావరణం కోరుకుంటున్నారని, అవి కూడా ఇవ్వలేని మీరు ఎందుకు అని ప్రశ్నించారు. ఇప్పటికైనా వెంటనే జవహర్ నగర్ డంప్ యార్డ్ ను తరలించి ప్రజలకు ఆరోగ్యాన్ని కాపాడండి అని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..