విగ్గులో బంగారం పట్టివేత...
- February 02, 2022
చెన్నై: చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ ఎత్తున బంగాన్ని స్వాధీనం చేసుకున్నారు.ఓ మహిళ వేసిన ప్లాన్ ఫ్లాప్ అయింది.విదేశాల నుంచి బంగారం స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయింది.చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్ తనిఖీల్లో 23 లక్షల విలువైన బంగారం పట్టుబడింది.
ఓ మహిళ తల విగ్గులో బంగారం దాచి గుట్టుగా బయటపడదామని ప్లాన్ చేసింది.అయితే కస్టమ్స్ అధికారుల ముందు ఆమె ఆటలు సాగలేదు.విగ్గులో దాచిన బంగారం స్వాధీనం చేసుకున్నారు చెన్నై కస్టమ్స్ అధికారులు.శ్రీలంక నుంచి చెన్నైకి విమానంలో తలవెంట్రుకల్లో విగ్గులో దాచుకున్న 23 లక్షల విలువైన 525 గ్రాముల బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నారు అధికారులు. ఈ కేసుకి సంబంధించి ముగ్గురు మహిళలను చెన్నై విమానాశ్రయంలో అరెస్టు చేశారు. వీరి వెనుక ఎవరు ఉన్నారనేది తెలుసుకునేందుకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఇండోనేసియాలో భారీ భూకంపం.. కుప్పకూలిన భవనాలు
- ఈనెల 19 నుంచి హార్ముజ్ పూర్తిగా ఓపెన్–ట్రంప్
- 3D మెరైన్ సర్వే ప్రాజెక్ట్ కోసం కొత్త వర్క ఏరియా:కోస్ట్ గార్డ్
- యూఏఈలో మొహర్రం ఆరంభం..!!
- కువైట్ T4 టెర్మినల్ ద్వారా ఆపరేషన్స్ పునఃప్రారంభం..!!
- MENAలో అత్యంత శాంతియుత దేశంగా ఖతార్..!!
- బురైదాలో నలుగురి ప్రాణాలను కాపాడిన సౌదీ బాలుడు..!!
- ఒమన్ లో పిల్లల సోషల్ మీడియా వినియోగం పై అధ్యయనం..!!
- ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్!









