ముంబైలో రాత్రి కర్ఫ్యూ ఎత్తివేత
- February 02, 2022
ముంబై: కరోనా ఉథృతి తగ్గుతోంది. దాంతో పలు రాష్ట్రాల్లో విధించిన కరోనా ఆంక్షలను ఎత్తివేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. కాగా మహారాష్ట్ర రాజధాని ముంబయిలో కూడా నైట్ కర్ఫ్యూని విధించిన సంగతి తెలిసిందే. అయితే ముంబయిలో కరోనా కేసులు తగ్గుతోన్న నేపథ్యంలో నైట్ కర్ఫ్యూని ఎత్తివేశారు. కరోనా ఆంక్షలను కూడా సడలించారు. ఈ మేరకు నేటి నుంచే నగరంలో రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, థీమ్ పార్క్ లకు అనుమతి ఇచ్చారు. కానీ 50 శాతంతో సామర్థ్యంతోనే నడిపించాలని నిబంధనను పెట్టారు. అలాగే బీచ్ లతో పాటు పార్కులు, పర్యాటక ప్రాంతాలను గతంలో లాగే తెరుచుకోనున్నాయి. అయితే అందరూ మాస్క్ లను తప్పనిసరిగా పెట్టుకోవాలని తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..







