విద్యాసంస్థల్లో ఆన్లైన్ బోధనపై హైకోర్టు కీలక ఆదేశాలు
- February 03, 2022
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి పలు సూచనలు జారీ చేసింది.
విద్యా సంస్థల్లో ఆన్ లైన్ బోధన కొనసాగించాలని, 20వ తేదీ వరకు ప్రత్యక్ష తరగతులతో పాటు..ఆన్ లైన్ బోధన ఉండే విధంగా చూడాలని సూచించింది. అలాగే హైదరాబాద్ నగరంలో ఉన్న మార్కెట్లు, బార్లు, రెస్టారెంట్ల వద్ధ కోవిడ్ నిబంధనలు అయలయ్యేలా చూడాలని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని ప్రశ్నించింది. త్వరలో జరగబోయే సమ్మక్క జాతరలో కోవిడ్ నియంత్రణ చర్యలు అమలు చేయాలని వెల్లడించింది. ప్రస్తుతం ముచ్చింతల్ లో జరుగుతున్న సమతామూర్తి సహస్రాబ్ది వేడుకల్లో కూడా నిబంధనలు అమలయ్యేలా చూడాలని ఏజీకి తెలిపింది. నిర్లక్ష్యం వల్ల కరోనా ప్రబలకుండా చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యతని గుర్తు చేసింది. రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ..తదుపరి విచారణ ఈనెల 20కి వాయిదా వేసింది హైకోర్టు.
తాజా వార్తలు
- జూన్లో 13 శాతం పెరిగిన కంటైనర్ల రవాణా:ఖతార్
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







