నాని తన స్టైల్లో రిలీజ్ డేట్ ను ప్రకటించేశాడు
- February 04, 2022కోవిడ్ థర్డ్ వేవ్ ప్రభావం కాస్త తగ్గింది. థియేటర్స్ విషయంలో పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉందని వార్తలు రావడంతో మన టాలీవుడ్, బాలీవుడ్ సహా అందరూ స్టార్స్, మేకర్స్ వారి సినిమా విడుదల తేదీలను తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మన టాలీవుడ్ను గమనిస్తే.. మన మేకర్స్ వారి సినిమాల విడుదల విషయంలో రెండు రిలీజ్ డేట్స్ను ప్రకటించడం గమనార్హం. అయితే అందరూ రెండు రిలీజ్ డేట్స్ ప్రకటించడమేంటి? అని నానికి అనిపించిందా? లేదా సరదాగా అనిపించిందో తెలియదు కానీ.. ఏకంగా తన 'అంటే సుందరానికీ' సినిమాకు ఏడు రిలీజ్ డేట్స్ను అనౌన్స్ చేశారు.
అంటే సుందరానికీ సినిమాకు సంబంధించి ఏడు రిలీజ్ డేట్స్ ఇవేనా? అని తెలియజేసేలా ఓ పోస్టర్ను నాని తన ట్విట్టర్లో షేర్ చేశారు. ‘మీరంత రెండు బ్లాక్ చేస్తే.. మేం ఏడు చేయకూడదా! ఫుల్ అవకాయ సీజన్ బ్లాక్డ్. మెల్లడా డిసైడ్ చేస్తాం’ అని ట్వీట్తో పాటు పోస్టర్ రిలీజ్ చేశారు. నాని తన స్టైల్లో చెప్పిన ఈ ట్వీట్ కి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతోన్న అంటే సుందరానికీ! సినిమా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తోంది. మలయాళ హీరోయిన్ నజ్రీయా నజీమ్ హీరోయిన్గా నటిస్తున్నారు.
మీరు అంతా రెండు రెండు Block చేస్తే మేము ఏడు చేయకూడదా 😉
— Nani (@NameisNani) February 3, 2022
Full ఆవకాయ season blocked.
Mellaga decide chestham 😎#AnteSundaraniki
#NazriyaFahadh #VivekAthreya @MythriOfficial @oddphysce @nikethbommi pic.twitter.com/31yC8ruXyZ
గత ఏడాది శ్యామ్ సింగరాయ్ చిత్రంతో హిట్ కొట్టిన నాని.. ఇప్పుడు దసరా అనే సినిమాను స్టార్ట్ చేయబోతున్నారు. ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం నాని సరికొత్త గెటప్లో మేకోవర్ అవుతున్నారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్లో సాగే చిత్రమిది. దీని కోసం నాని తెలంగాణ యాసపై మరింత ఫోకస్ పెట్టబోతున్నారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం