సౌదీలో ఇఖామా, రీ-ఎంట్రీ వీసా గడువు పొడిగింపు
- February 05, 2022
సౌదీ: కరోనావైరస్ మహమ్మారి కారణంగా ట్రావెల్ బ్యాన్ విధించిన 19 దేశాల నుండి వచ్చిన ప్రవాసులు రెసిడెన్సీ పర్మిట్ (ఇఖామా) చెల్లుబాటు గడువును మార్చి 31 వరకు పొడిగించారు. తాజా నిర్ణయంతో ఆయా దేశాల వారు ప్రయోజనం పొందుతారని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ (జవాజత్) ప్రకటించింది. 19 దేశాల్లో టర్కీ, లెబనాన్, ఇథియోపియా, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా, మొజాంబిక్, బోట్స్వానా, లెసోతో, ఎస్వతిని, మలావి, జాంబియా, మడగాస్కర్, అంగోలా, సీషెల్స్, మారిషస్, కొమొరోస్, నైజీరియా ఉన్నాయి. ఈ దేశాలకు ఎగ్జిట్, రీ-ఎంట్రీ వీసా చెల్లుబాటును ఆటోమెటిక్ గా పొడిగించడం ప్రారంభించినట్లు జవాజాత్ ప్రకటించింది. అయితే ఒక డోస్ కరోనావైరస్ వ్యాక్సిన్ తీసుకున్న ప్రవాసులకు ఈ పొడిగింపు వర్తించదు. అలాగే విజిట్ వీసాల చెల్లుబాటు గడువును కూడా పొడిగించడం జరిగిందని వెల్లడించింది.
తాజా వార్తలు
- బోయింగ్ 777 విమానాల విక్రయం.. ఆరోపణలను ఖండించిన సౌదియా ..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 గెలిచిన విజేత..!!
- ప్రీ మారిటల్ మెడికల్ సర్టిఫికేట్ రూల్స్ ఉల్లంఘనపై ఒమన్ హెచ్చరిక..!!
- జూన్లో 13 శాతం పెరిగిన కంటైనర్ల రవాణా:ఖతార్
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం







