కోవిడ్ 19: ఆరు గల్ఫ్ దేశాల నుంచి 700,000 మంది భారతీయులు స్వదేశానికి
- February 05, 2022
కువైట్: కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో ఆరు గల్ఫ్ దేశాల నుంచి 700,000 మంది భారతీయులు స్వదేశానికి తిరిగి వెళ్ళినట్లు గణాంకాలు చెబుతున్నాయి. భారత ప్రభుత్వం ఈ మేరకు గణాంకాల్ని విడుదల చేసింది. మొత్తంగా 716,662 మంది కార్మికులు భారతదేశానికి తిరిగి వచ్చారు. వీరిలో దాదాపు సగం మంది (330,058) యూఏఈ నుంచి వచ్చినవారే. సౌదీ అరేబియా (137,900), కువైట్ (97,802), ఒమన్ (72,259) ఆ తర్వాతి స్థానంలో వున్నాయి. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ విషయాల్ని పార్లమెంటు సమావేశాల్లో వెల్లడించారు. స్వదేశానికి తిరిగి వచ్చినవారిని ఆదుకోవడంతోపాటు, కోవిడ్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయినవారికి తగిన సాయం అందించేందుకు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు భారత ప్రభుత్వం పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







