ఏపీ కరోనా అప్డేట్

- February 10, 2022 , by Maagulf
ఏపీ కరోనా అప్డేట్

అమరావతి: ఏపీలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కోవిడ్ కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో కొత్తగా 1,345 కోవిడ్ కేసులు వచ్చాయి. మరో నలుగురు కరోనాతో చనిపోయారు. చిత్తూరు, కృష్ణా, కర్నూలు, నెల్లూరు జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున కోవిడ్ తో మరణించారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 6వేల 576 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 40వేల 888 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24గంటల వ్యవధిలో రాష్ట్రంలో 26వేల 393 కరోనా టెస్టులు చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 14,683కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 3,27,59,439 కరోనా టెస్టులు చేశారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,09,967. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 22,54,400. ఈ మేరకు వైద్యఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com