మార్చి నాటికి ఫ్యామిలీ, విజిట్ వీసాల జారీ
- February 13, 2022
కువైట్: దేశంలో ఇన్ఫెక్షన్ల సంఖ్య ఇటీవల తగ్గిన నేపథ్యంలో మార్చి నాటికి ఫ్యామిలీ విజిట్, టూరిస్ట్ విజిట్ వీసాలను జారీ చేయాలని అంతర్గత మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. అయితే దేశంలో "కరోనా" మహమ్మారికి సంబంధించిన తాజా ఆరోగ్య పరిస్థితిపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుండి నివేదిక అందాల్సి ఉందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని నివాస వ్యవహారాల విభాగం తెలిపింది. ఆ నివేదికి రాగానే వీసాల జారీ అంశాలను పరిశీలించనున్నట్లు పేర్కొంది. ప్రవాసుల కోసం అన్ని రకాల వీసాలను జారీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నప్పటికీ, కరోనా నేపథ్యంలో ఫ్యామిలీ, టూరిస్టు వీసాల జారీని తాత్కలికంగా నిలిపివేశారు. మరోవైపు కేబినెట్ నిర్ణయం ప్రకారం ఇప్పటికే వర్క్ వీసాలు, కమర్షియల్ వీసాల జారీని పునరుద్ధరించారు.
తాజా వార్తలు
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్







