మార్చి నాటికి ఫ్యామిలీ, విజిట్ వీసాల జారీ
- February 13, 2022
కువైట్: దేశంలో ఇన్ఫెక్షన్ల సంఖ్య ఇటీవల తగ్గిన నేపథ్యంలో మార్చి నాటికి ఫ్యామిలీ విజిట్, టూరిస్ట్ విజిట్ వీసాలను జారీ చేయాలని అంతర్గత మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. అయితే దేశంలో "కరోనా" మహమ్మారికి సంబంధించిన తాజా ఆరోగ్య పరిస్థితిపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుండి నివేదిక అందాల్సి ఉందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని నివాస వ్యవహారాల విభాగం తెలిపింది. ఆ నివేదికి రాగానే వీసాల జారీ అంశాలను పరిశీలించనున్నట్లు పేర్కొంది. ప్రవాసుల కోసం అన్ని రకాల వీసాలను జారీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నప్పటికీ, కరోనా నేపథ్యంలో ఫ్యామిలీ, టూరిస్టు వీసాల జారీని తాత్కలికంగా నిలిపివేశారు. మరోవైపు కేబినెట్ నిర్ణయం ప్రకారం ఇప్పటికే వర్క్ వీసాలు, కమర్షియల్ వీసాల జారీని పునరుద్ధరించారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









