మొబైల్ బస్ కోవిడ్-19 వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ ప్రారంభం
- February 14, 2022
ఒమన్: రెండువారాలపాటు కొనసాగనున్న మొబైల్ బస్ కోవిడ్-19 వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ ప్రారంభమైంది. డైరెక్టరేట్-జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, ఆస్టర్ అల్ రఫా హాస్పిటల్ సహకారంతో మస్కట్ గవర్నరేట్లో ఈ సర్వీసును ప్రారంభించారు. ఈ బస్సు పలు ప్రాంతాల్లో పర్యటించి సిటిజన్స్/రెసిడెంట్స్ లకు కోవిడ్ -19 వ్యాక్సిన్ను అందజేస్తుందని మస్కట్ గవర్నరేట్లోని డైరెక్టరేట్-జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్లోని డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ డాక్టర్ లామియా బింట్ హుస్సేన్ అల్ బలూషియా చెప్పారు. అల్ మబెల్లా సౌత్లోని మస్కట్ మాల్ లో రెండు రోజుల పాటు సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుందన్నారు. ఫిబ్రవరి 24 వరకు బుషర్, ముత్రా, మస్కట్, అల్ అమెరత్లోని విలాయత్లలో కూడా ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుందని అల్ బలూషియా తెలిపారు. మొబైల్ బస్ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ ముఖ్యంగా బూస్టర్ డోస్ను(మూడో డోస్) పెంచడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.
తాజా వార్తలు
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్







