మనీలాండరింగ్ కు పాల్పడ్డ 11మందికి 52 ఏళ్ల జైలు శిక్ష
- February 14, 2022
సౌదీ: మనీలాండరింగ్లో పాల్గొన్న గ్రూప్కు 52 సంవత్సరాల జైలు శిక్ష, SR62.5 మిలియన్ జరిమానాలను ప్రత్యేక న్యాయస్థానం విధించింది. మనీలాండరింగ్ నేరాలకు పాల్పడ్డ వారిలో 11 మంది సభ్యుల (ఇద్దరు సిటిజన్స్, తొమ్మిది మంది రెసిడెంట్స్) ముఠా సభ్యులు ఉన్నారని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. వీరు అనేక వాణిజ్య సంస్థలు, బ్యాంక్ ఖాతాల నుండి మొత్తం SR10 బిలియన్ల కంటే ఎక్కువ మొత్తంలో డబ్బును స్వీకరించడం లేదా బదిలీ చేయడం ద్వారా చట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపించింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఇన్వెస్టిగేషన్ నేరస్థులకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు సమర్పించడంతో వారికి మొత్తం 52 సంవత్సరాల జైలు శిక్ష, SR62.5 మిలియన్ల జరిమానాతో ప్రత్యేక న్యాయస్థానం ప్రాథమిక తీర్పును వెల్లడించింది. అలాగే SR1,672,862 విలువైన ఆస్తులను జప్తు చేసింది. జైలు శిక్షలు అనుభవించిన తర్వాత సౌదీ అరేబియా నుండి రెసిడెంట్స్ ను బహిష్కరించనున్నారు. సిటిజన్స్ ను వారి శిక్షా కాలంలో ప్రయాణించకుండా నిషేధించింది.
తాజా వార్తలు
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్







